ఏపీలో భారీగా తగ్గిన కరోనా.. కొత్తగా 381 కేసులు, ఒక మరణం నమోదు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు… అస్సలు నిలకడగా ఉండటం లేదు. ఓరోజు భారీగా పెరుగుతూ.. మరో రోజు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక నిన్న జరిగిన కరోనా కేసులు.. ఇవాళ ఒక్క సారిగా తగ్గుముఖం పడతాయి. ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… గడచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా… కొత్తగా 381 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,65 , 235 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒకరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 365 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4743 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 414 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 38 , 896 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 94 ,04 , 281 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,46 , 127 లక్షలకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news