ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 1171 కేసులు

-

చైనాలో పురుడు పోసుకున్న కరోనా మహమ్మారి వదలేలా కనిపించడం లేదు. అటు ఏపీలోనూ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏపీ లో నిన్న పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ కాస్త తగ్గాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1171 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,40,349 కి పెరిగింది.

ఒక్క రోజు వ్యవధి లో మరో 11 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,108 కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 55, 251 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 79, 25 , 469 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 13,749 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 1207 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,12,492 లక్షలకు చేరింది.ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలు అమలు అవుతూనే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news