వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదు

-

గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై కేసు నమోదు అయింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు పోలీస్ అధికారులు. ఈ నెల 18న షాదీఖానా శ్లాబ్‌ అభివృద్ధి పనుల్లో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రిటర్నింగ్‌ అధికారి సబ్‌ కలెక్టర్ రాహుల్‌ మీనా.. ఎమ్మెల్యేకు వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు.

ఇటీవలే ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.  అనుమతి లేకుండా రాచమల్లు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున.. కోడ్‌ ఉల్లంఘించారని పోలీసులకు ప్లయింగ్‌ స్క్వాడ్‌ సిబ్బంది ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. మరోవైపు పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్‌లను పలమనేరు ఎమ్మెల్యే నల్లప్పగారి వెంకటేగౌడ అందించారు. ఈ క్రమంలో ఆయనకు ఈసీ అధికారులు షోకాజ్ నోటీసులు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news