ఏపీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ నేత రఘువీరా జోస్యం..!

-

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల  పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు గొడవల మధ్య జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తరువాత కూడా ఏపీలో గొడవలు జరిగాయి. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో 144 సెక్సన్ విధించారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంతగా రసవత్తరంగా జరిగాయి. సినిమాలను మించి పోలింగ్ సమయాల్లో పోలింగ్ అనంతరం కేంద్రాల్లో గొడవలు జరిగాయి. ప్రధాన పార్టీలు హోరాహోరిగా ప్రచారం నిర్వహించాయి.

మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ, ఈసారి ఎలాగైనా గెలవాలని టీడీపీ కూటమి వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించారు. మరో ఆరు రోజుల్లో ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత డ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచిందని అన్నారు. కచ్చితంగా ఫలానా పార్టీ గెలుస్తుందని కూడా చెప్పలేమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధికార వైసీపీ లేదా? ఎన్డీఏ కూటమి ఎవరు అధికారంలోకి వచ్చినా 95 నుంచి 97 సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావం చాలా ఉందని అన్నారు. కాంగ్రెస్ డబ్బు, మద్యం ప్రభావం లేని నాలుగైదు చోట్లా విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news