సీఎం రమేష్‌పై ఫోర్జరీ కేసు నమోదు..!

-

బీజేపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫోర్జరీ కేసు నమోదైంది. సినీ హిరో వేణు.. తన PCL జాయింట్ వెంచర్ కంపెనీలో.. సీఎం రమేష్ ఫోర్జరీకి పాల్పడి రూ.450 కోట్లు స్కామ్ చేశారనే ఆరోపణలతో ఆయనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీన్ని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే దీనిపై సినీ హిరో వేణు తరఫున కావూరి భాస్కర్‌రావు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

క్రైమ్ ఏపీసీ అరగంట సేపు నా స్టేట్‌మెట్ రికార్డు చేశారని కావూరి తెలిపారు. సీఎం రమేష్‌ వేల కోట్లు స్కామ్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయని.. సీబీఐతో విచారణ చేయిస్తే అన్ని విషయాలు బయటికొస్తాయని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. గతంలో టీడీపీ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన సీఎం రమేష్ ఆ తర్వాత బీజేపీలో చేరారు. అయితే ఈసారి పొత్తులో భాగంగా బీజేపీ.. ఆంధ్రప్రదేశ్‌లో ఆరు ఎంపీ స్థానాల నుంచి పోటీ చేయనుంది. దీంతో సీఎం రమేష్ ఈసారి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయలేదు.

Read more RELATED
Recommended to you

Latest news