ప్యాంట్రీ కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల

-

ప్యాంట్రీ కార్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని అనుమతులు తీసుకున్న ప్యాంట్రీ కార్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు. బీజేపీ లో ఉన్న టీడీపీ ఏజెంట్లకు టికెట్లు ఇస్తున్నారు. చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో వేశారని పేర్కొన్నారు సజ్జల. 

స్పష్టమైన అజెండాతో వైసీపీ ఉందని ప్రజలకు తెలుసు అని.. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు నిర్ణయించుకున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే.. జగన్ మోహన్ రెడ్డి తెచ్చేవన్నీ ఆగిపోతాయన్నారు. చంద్రబాబు మాయమాటలు చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు.. ఆయన మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్ని పార్టీలతో కూటమీలు కట్టినా.. చివరికీ ఏపీ ఎన్నికల్లో విజయం మాత్రం వైసీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Latest news