వాడు కొత్త ప్రభాకర్ రెడ్డా.. కొజ్జా ప్రభాకర్ రెడ్డా? : మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు

-

లోక్ సభ ఎన్నికల వేళ.. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వాడు కొత్త ప్రభాకర్ రెడ్డా.. కొజ్జా ప్రభాకర్ రెడ్డినా..? అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి పీ.వెంకట్రామిరెడ్డికి రూ.100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు రఘునందన్ రావు. ఎంపీగా గెలిచాక రూ.100 కోట్ల నిధులతో పీవీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.

మరోవైపు  బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటైర్లు వేశారు. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయననే  బీజేపీ మెదక్ లోకసభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చినోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news