Andhra Pradesh : గ్రూప్-2 పరీక్షల కీ విడుదల

-

నిన్న జరిగిన గ్రూప్-2 పరీక్షల కీని APPSC విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా కీపై అభ్యంతరాలు స్వీకరిస్తుంది. పోస్ట్, వాట్సాప్, ఎస్ఎంఎస్‌ ద్వారా వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని APPSC స్పష్టం చేసింది. ఇక గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ రిజల్ట్స్ ను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమా­ర్‌ తెలిపారు. జూన్‌ లేదా జూలైలో గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహిస్తామని అన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్ష ఫిబ్ర‌వ‌రి 25 న‌ ముగిసింది. ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 87.17 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news