ఆళ్లగడ్డ లో అతిసార వ్యాధితో ముగ్గురు మృతి..చంద్రబాబు సీరియస్

-

3 Die of Diarrhoea in Allagadda Town, 2 Serious: నంద్యాల పరిధి…ఆళ్లగడ్డలో అతిసారతో ముగ్గురు మరణించారు. అయితే.. ఈ సంఘటనపై స్పందించారు సీఎం చంద్రబాబు. అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. ఘటనపై అధికారులతో మాట్లాడారు. మరణాలు జరిగిన ప్రాంతంలో ప్రజల పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు.

3 Die of Diarrhoea in Allagadda Town, 2 Serious

ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కోరారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించటం తో పాటు….అవసరాన్ని బట్టి ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. అతిసారం ప్రబలిన అభ్యుదయ కాలనీలో పరిస్థితులను ఎప్పటికప్పుడు వైద్యాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ ఘటనకు గల కారణాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించి పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news