BREAKING : జెసి ప్రభాకర్ రెడ్డికి 41 సీఆర్ పీసీ నోటీసులు

-

అనంతపురం కలకలం చోటు చేసుకుంది. జెసి ప్రభాకర్ రెడ్డికి 41 సీఆర్ పీసీ నోటీసు ఇచ్చారు అనంతపురం పోలీసులు. అయితే పోలీసులు ఇచ్చిన నోటీసు తీసుకోవడానికి నిరాకరించారు జెసి. నిబంధనల మేరకు సర్వే చేయాలని అధికారులను కోరినా ఫలితం లేదంటున్న జేసీ…అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినా కనీస స్పందన లేదని ఫైర్ అయ్యారు.

మున్సిపల్ ఉద్యోగుల కోసం 1983 లో లే అవుట్ లోనే 50 అడుగులు రోడ్డు ఉందని… ప్రహరీ గోడ నిర్మాణ పనులు ఆపాలని ఎక్కడ అనడం లేదని వెల్లడించారు. సర్వే చేసి గోడ నిర్మాణం చేయాలని కోరుతున్నానని..2022లో 60 అడుగులతో మున్సిపల్ అఫ్రూవల్ ఉందని చెప్పారు. ఆర్ అండ్ బి అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నానని… ఎమ్మెల్యే అన్నీ సగం సగం పనులు చేసి ఊరును పాడు చేస్తున్నాడని మండిపడ్డారు. పోలీసులు బందోబస్తు పెట్టుకుని గోడ కడుతున్నారని చెప్పారు. ప్రజావేదికను కూల్చడానికి 10 నిమిషాలు పట్టలేదని.. అదే విధంగా ప్రహరీ గోడ ఎన్ని రోజుల్లో కట్టారో అన్ని నిమిషాలలో కూలుస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news