ఆసియా కప్‌కు నేడు భారత జట్టు ఎంపిక…బుమ్రాకు కీలక బాధ్యతలు !

-

ఆసియా కప్-2023 కోసం ఇవాళ భారత జట్టును ప్రకటించనున్నారు. ఇవాళ ఢిల్లీలో సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ మీటింగ్ కు కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ కూడా హాజరు కానున్నారు. వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకొని… 17 మందిని టోర్నీకి ఎంపిక చేస్తారని సమాచారం.

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మధ్యాహ్నం 12 తర్వాత జట్టును ప్రకటించనున్నారు. ఈనెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బుమ్రాకు కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇస్తారని సమాచారం.

కాగా, ఐర్లాండ్ జట్టుపై టీమిండియా మరో టి20 మ్యాచ్ గెలిచింది. మూడు టి20 మ్యాచ్లో సిరీస్ లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. నిన్న డూబ్లిన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఏకంగా 33 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news