ఏపీలో నేడు కొత్త‌గా 50 క‌రోనా పాజిటివ్ కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుతుంది. అయితే ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో నిన్న‌టితో పోలిస్తే.. నేడు స్వ‌ల్పం గా క‌రోనా కేసుల సంఖ్య పెరిగింది. శుక్ర‌వారం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 46 గా ఉండేది. కాగ నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు క‌రోనా బులిటెన్ ను విడుద‌ల చేశారు. ఈ క‌రోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో 50 కరోనా వైర‌స్ పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అయ్యాయి.

కాగ నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 12,789 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు. కాగ నేడు ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఒక‌రు మృతి చెందారు. థ‌ర్డ్ వేవ్ ముగిసిన త‌ర్వాత‌.. రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌డం ఇదే తొలిసారి. కాగ చాలా రోజుల నుంచి రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు న‌మోదు కావ‌డం లేదు.

కాగ నేటి మ‌ర‌ణంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణించిన వారి సంఖ్య.. 14,730 కి చేరింది. అలాగే నేడు.. రాష్ట్రంలో 77 మంది బాధితులు క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్ర‌స్తుతం 633 క‌రోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news