కందికొండ ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు : కుటుంబ స‌భ్యులు

-

తెలంగాణ రాష్ట్రంలోని ప్ర‌ముఖ ర‌చయిత కందికొండ యాద‌గిరి (49) ఈ రోజు మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. ఇట్లు శ్రావ‌ణి సుబ్ర‌హ్మ‌ణ్యం అనే సినిమాలో మ‌ళ్లీ కూయ‌వే గువ్వా.. అనే పాట‌తో తెలుగు ప్రేక్షకుల‌కు సుప‌రిచితుడు అయ్యాడు. కాగ ఆయ‌న ఈ రోజు ఆక‌స్మ‌తుగా మ‌ర‌ణించ‌డం పై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేశారు. నెటిజన్లు కూడా కందికొండ మ‌ర‌ణం పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయ‌న మ‌ర‌ణం స‌హ‌జమైన‌ది కాద‌ని అంటూ నెటిజ‌న్లు పోస్టులు పెట్టారు.

కాగ దీనిపై కందికొండ యాద‌గిరి కుటుంబ స‌భ్యులు స్పందించారు. కొందికొండ యాద‌గిరి ఆనారోగ్యంతోనే మ‌ర‌ణించార‌ని స్ప‌ష్టం చేశారు. ఆయ‌న ఆత్మ‌హత్య చేసుకోలేద‌ని కుటుంబ స‌భ్యులు అన్నారు. కాగ కందికొండ యాద‌గిరి గ‌త రెండు సంవ‌త్స‌రాల నుంచి క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నారు. కీమో థెర‌ఫితో స్పైన‌ల్ కార్డ్ కూడా దెబ్బ‌తింద‌ని స‌మచారం.

దీంతో ఆయ‌న ఆరోగ్యం విషమించ‌డంతో నేడు మ‌ర‌ణించార‌ని తెలుస్తోంది. కాగ ఆయ‌న ఆత్మ‌హ‌త్య చేసుకోలేద‌ని కుటుంబ స‌భ్యులు కూడా స్ప‌ష్టం చేశారు. దీంతో కందికొండ మ‌ర‌ణంపై ఉన్న మిస్ట‌రీ తొల‌గిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news