ఆంధ్ర ప్ర‌దేశ్‌లో నేడు కొత్త‌గా 69 క‌రోనా కేసులు

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుతూ, స్వ‌ల్పంగా పెరుగుతూ ఉన్నాయి. అయితే థ‌ర్డ్ వేవ్ ముగిసిన త‌ర్వాత మాత్రం.. రాష్ట్రంలో క‌రోనా కేసులు వంద లోపే వస్తున్నాయి. కాగ నేటి క‌రోనా బులిటెన్ ను ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాసేప‌టి క్రితం విడుద‌ల చేశారు. కాగ ఈ కరోనా బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 69 మంది క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.

దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌.. 23,19,012 కు చేరింది. కాగ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా 82 మంది బాధితులు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు 23,03,772 మంది బాధితులు క‌రోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కాగ ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా యాక్టివ్ కేసులు 510 గా ఉన్నాయి. కాగ రాష్ట్రంలో ఈ రోజు కూడా క‌రోనా మ‌ర‌ణాలు సంభ‌వించ‌లేదు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌ర‌ణాలు.. 14,730 గా ఉన్నాయి. కాగ రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 12,820 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్షలు నిర్వ‌హించారు.

Read more RELATED
Recommended to you

Latest news