ఏపీలో విషాదం..రైల్వే ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్న జంట.

-

 

ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా కంభం మండలం సైదాపురం సమీపంలో రైల్వే ట్రాక్ పై జంట మృతదేహాలు కల కలం రేపాయి. తాజాగా పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది ఓ జంట. ఆత్మహత్యకు పాల్పడ్డ జంట ప్రేమికులా లేక భార్యాభర్తల అనే కోణంలో విచారిస్తున్నారు రైల్వే పోలీసులు.

జంట ఆత్మహత్య చేసుకునే ముందు కూల్ డ్రింక్, కొబ్బరి నీళ్ళు సేవించిన అన్నవాళ్లు కనిపించాయి. కూల్ డ్రింక్, కొబ్బరి నీళ్ళలో ఏమైనా కలుపుకుని తాగారా అని విచారిస్తున్నారు రైల్వే పోలీసులు. మృతులు పెద్దరావీడు మండలం బద్దీడుకు చెందిన వదినా, మరుదులు రాములమ్మ, శ్రీనుగా గుర్తించారు పోలీసులు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డారా.. మరేదైనా కారణమా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news