ఆ తాగుబోతుతో నాకు పెళ్లొద్దు.. దండలు మార్చుకుంటుండగా షాకిచ్చిన వధువు

-

ఈరోజుల్లో మద్యం సేవించని అబ్బాయిలు చాలా అరుదు. ఏదైనా అకేషన్​లో తాగడం చాలా మందికి అలవాటు. ఆ మధ్య ఓ వరుడు మద్యం సేవించి ఆ మత్తులో తన పెళ్లి సంగతే మరిచిపోయి మండపానికి ఆలస్యంగా వెళ్లాడు. దీంతో ఆ వధువు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. తాజాగా మద్యం సేవించి మండపానికి వచ్చిన ఓ వరుడుకి షాక్ ఇచ్చింది మరో వధువు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లాలో చౌబేపుర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి జన్సా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మరో గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఆదివారం రాత్రి జరగాల్సి ఉంది. సాయంత్రం ఊరేగింపుగా ముందుగా బుక్‌ చేసుకున్న ఫంక్షన్‌ హాల్‌కు వరుడు, అతడి బంధువులు చేరుకున్నారు. కాసేపటికే వధువు తన స్నేహితులతో కలిసి వేదికపైకి వచ్చింది.

వధూవరులిద్దరూ పూలదండలు మార్చుకునే సమయంలో అతడూ మద్యం సేవించి ఉన్నాడని వధువు గమనించింది. వెంటనే వేదికపై నుంచి దిగి ఫంక్షన్‌ హాల్‌లోని ఓ గదిలోకి వెళ్లిపోయింది. కుటుంబ పెద్దలు గంటల తరబడి ఎంత నచ్చజెప్పినా ఆ యువతి వినలేదు. దీంతో చేసేదేమిలేక ఇరు కుటుంబాలు పెళ్లి రద్దుకు అంగీకారం తెలిపాయి.

Read more RELATED
Recommended to you

Latest news