విశాఖలో విషాదం..వృద్ధురాలును మర్డర్‌ చేసిన వాలంటీర్…!

-

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. వృద్ధురాలును మర్డర్‌ చేశాడు ఓ వాలంటీర్. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… విశాఖలోని పెందుర్తి సుజాతానగర్ లో వృద్ధురాలును హతమార్చాడు ఓ వాలంటీర్. చికెన్ షాపులో పార్ట్ టైమ్ గా వాలంటీర్‌ రాయవరపు వెంకటేష్ (26) పనిచేస్తున్నాడు.

గత కొన్ని రోజులుగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు వెంకటేష్. ఓనర్ తల్లి మెడలో ఉన్న బంగారు గొలుసును దొంగలించే ప్రయత్నంలో వృద్ధురాలు కోటగిరి వెంకటలక్ష్మి (72)ని హత మార్చాడు వాలంటీర్. ఇంటికి వచ్చే సరికి తల్లి విగతజీవిగా పడి ఉండడంతో పోలీసులు సమాచారం అందించాడు వృద్ధిరాలి కుమారుడు. ఇక సీసీ కెమెరా ద్వారా ఆధారాల ద్వారా వాలంటరీ వెంకటేష్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news