కడపలో దారుణం..మతిస్థిమితం లేని కొడుకును కొట్టి చంపిన తండ్రి

-

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది. కన్న కొడుకును కొట్టి చంపాడు ఓ కసాయి తండ్రి. మతి స్థిమితం లేని కొడుకును చూసుకోవడానికి బరువయ్యి కొడుకు ముస్తహీం(5) ను కొట్టి చంపేశాడు తండ్రి ఇమ్రాన్. ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజి రోడ్డులో ఈ ఘటన జరిగింది. చిన్నప్పుడు నుంచి మతి స్థిమితం లేక ఇంట్లోనే ఉంటున్నాడు ముస్తహీం.

A father beats his insane son to death

అయితే.. ముస్తహీం పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో మరో వివాహాం చేసుకున్నాడు ముస్తహీం తండ్రి ఇమ్రాన్. సోమవారం ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు బాలుడు. ఆ బాలుడు ఒంటిపై రక్త గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు.. దర్యాప్తు చేశారు. తండ్రి ఇమ్రాన్ ను విచారించంగా తన కొడుకును కొట్టి చంపినట్లు ఒప్పుకున్నాడు ఇమ్రాన్. దీంతో అతన్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news