ఆస్తి కోసం సొంత మనవడిని హత్య చేసిన కసాయి తాతయ్య !

-

పశ్చిమ గోదావరిలో విషాదం చోటు చేసుకుంది. ఆస్తి కోసం సొంత మనవడిని హత్య చేశాడు ఓ కసాయి తాతయ్య. కొడుకు, కోడలు విడాకులకు సిద్ధం కావడంతో తన ఆస్తి మనవడికి వెళ్తుందని భావించి దారుణానికి పాల్పడ్డాడు తాత పోకల నాగేశ్వరరావు. పెంటపాడు మండలం మీనావల్లూరులో ఆరేళ్ల బాలుడు పొకల వెంకట కళ్యాణ్ అనుమానాస్పద మృతి కేసులో మిస్టరీ వీడుతోంది.

కుటుంబ కలహాల నేపథ్యంలో తాతయ్య… బాలుడిని హత్య చేశాడని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఇక ప్రస్తుతం తాతయ్య పోకల నాగేశ్వరరావు పరారిలో ఉన్నాడు. బాలుడి తల్లి శిరీష తండ్రి పోకల సత్తిబాబులకు 11ఏళ్ల క్రితం వివాహం జరుగగా.. వీరి మధ్య కొంత కాలంగా విభేదాలు వస్తున్నాయి. ఇక కొడుకు-కోడలు విడాకులు తీసుకుంటే తన ఆస్తి మొత్తం మనవడికి వెళ్ళిపోతుందనే అనుమానంతో బాలుడిని తాత పోకల నాగేశ్వర రావు హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే పోలీసుల అదుపులో బాలుడు తండ్రి సత్యనారాయణ, నాయనమ్మ లక్ష్మి ఉన్నారు. దీనిపై ఇంకా విచారణ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news