ఏలూరు జిల్లాలో దారుణం.. పట్టపగలే నడిరోడ్డుపై భార్యను నరికి చంపిన భర్త..!

-

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి దారుణాలు నిత్యం చోటు చేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళ్లితే.. ఏలూరు జిల్లా  కొయ్యలగూడెం మండలం రామానుజపురం గ్రామంలో భార్య-భర్త మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఇవాళ పట్టపగలే నడిరోడ్డు పై కత్తితో నరికి హత్య చేశాడు భర్త.

ముఖ్యంగా కుటుంబ కలహాల నేపథ్యంలో రాజనాల సూర్యచంద్రం తన భార్య సాయిలక్ష్మీతో తరుచూ గొడవలు పడుతుండేవాడు. ఇవాళ మధ్యాహ్నం సమయంలో భార్యతో వాగ్వాదానికి దిగాడు. భార్య, భర్తల మధ్య మాట మాట పెరిగి గొడవ పెద్దది కావడంతో భార్య లక్ష్మీ ఇంటి నుంచి బయటికి వచ్చేసింది. ఇదే సమయంలో మరింత కోపంతో భర్త సూర్యచంద్రం కత్తితో సాయిలక్ష్మీ మెడ పై నరికాడు. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో ఘటన స్థలం వద్దనే ప్రాణాలను కోల్పోయింది లక్ష్మీ. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన జరిగిన సమయంలో భర్త సూర్యచంద్రం మద్యం మత్తులో ఉన్నట్టు స్థానికులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news