BREAKING : ఆదిమూలపు సురేష్ కు అదనపు భద్రత ?

-

చంద్రబాబు ఇష్యూపై వైసీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ఆదిమూలపు సురేష్ అంతు చూస్తానని చంద్రబాబు అనడం మంచిది కాదని.. మంత్రి అంతు చూస్తామన్న బాబు తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు డొక్కా మాణిక్య వరప్రసాద్.

ఆదిమూలపు సురేష్ కు అదనపు భద్రత కల్పించాలని జగన్‌ సర్కార్‌ను డిమాండ్‌ చేశారు డొక్కా మాణిక్య వరప్రసాద్. దళిత సాధికారత పెరిగితే బాబుకు కోపం ఎందుకు? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఎందుకు ఇరిటేషన్ వస్తోంది?? అన్నారు. అసలు దళితుల పై చంద్రబాబు స్టాండ్ ఏంటి? అని ప్రశ్నించారు. దళితుల అభివృద్ధికి చంద్రబాబు చేసింది ఏంటి? జగన్ నాయకత్వంలో దళితులు చాలా ఐక్యంగా ఉన్నారని వివరించారు డొక్కా మాణిక్య వరప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news