175 నియోజకవర్గాల్లో ఎవరైనా జగన్ బొమ్మతో గెలవాల్సిందే – ఆదిమూలపు సురేష్

-

175 నియోజకవర్గాల్లో ఎవరైనా జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మతో గెలవాల్సిందేనని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. ప్రకాశం జిల్లాలో మార్పుల పై విజయసాయిరెడ్డి, బాలినేని కసరత్తు చేస్తున్నారని వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్త సమన్వయకర్తలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. కొండెపి లో కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్.

అధిష్టానం నిర్ణయం ప్రకారం అందరూ కలిసికట్టుగా పని చేస్తాం అని తీర్మానం చేశారని వెల్లడించారు. అధిష్టానం నిర్ణయం వెనుక అనేక కారణాలు, వ్యూహాలు ఉంటాయన్నారు. గత ఎన్నికల్లో ఎస్సీ నియోజకవర్గాల్లో కొండెపి ఒక్క చోటే వైసీపీ ఓటమి పాలైందని పేర్కొన్నారు. ఈ సారి కొండెపి లో వైసీపీ జెండా ఎగరేయటం ఖాయమన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎవరైనా జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మతో గెలవాల్సిందేనని… చంద్రబాబు నియోజకవర్గం ఎందుకు మారారో, ఎన్టీఆర్, బాలకృష్ణ హిందూపూర్ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని చురకలు అంటించారు మంత్రి ఆదిమూలపు సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news