వైసీపీ నేతలు వెర్రి కుక్కలు..అందరినీ జైలుకు పంపిస్తాం – ఆది నారాయణరెడ్డి

-

వైసీపీ నేతలు వెర్రి కుక్కలు..అందరినీ జైలుకు పంపిస్తామని హెచ్చరించారు బిజెపి ఎంఎల్ఏ, మాజీమంత్రి ఆది నారాయణరెడ్డి. ఇవాళ మీడియాతో ఆది నారాయణరెడ్డి మాట్లాడుతూ…. వెర్రికుక్కల లాగా వైసీపీ వాళ్ళు రకరకాల బాష మాట్లాడుతున్నారు…. వైసిపి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసారని ఆగ్రహించారు. జగన్ ప్రతీదాంట్లో వేలు పెట్టాడు.. జగన్ పాపాలు వెతకాల్సిన అవసరం లేదన్నారు.వైజాగ్ లో స్టీలు ప్లాంటు ఎటూ వెళ్ళిపోదు…పోలవరం కు దశల వారీగా నిధులు కేంద్రం విడుదల చేస్తుందని వెల్లడించారు.

Adinarayana Reddy on jagan

NDA ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని… కడప నుంచీ హైదరాబాదు కు విమానం తిరగకుండా చేసాడంటూ జగన్‌ పై విరుచుకుపడ్డారు ఆది నారాయణరెడ్డి. పెద్దిరెడ్డి సహా అందరూ జైలుకు పోతారు…వెయ్యి కోట్ల కే కేజ్రీవాల్, కవిత జైలుకెళ్ళారన్నారు. లక్ష కోట్ల స్కామ్ కి వైసీపీ వాళ్ళు కచ్చితంగా జైలుకి వెళతారు…మళ్ళీ వైసీపీ రావడానికి NDA కూటమి చెవులో పూలు పెట్టుకోలేదని వెల్లడించారు. వైసీపీ వాళ్ళ కేసులు, కాసులు అన్నీ లాగుతామని హెచ్చరించారు ఆది నారాయణరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news