ఏపీ ప్రజలకు అలర్ట్‌…చెట్ల కింద ఉండొద్దు !

-

ఏపీ ప్రజలకు అలర్ట్‌…ఇవాళ పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌ హెచ్చరించారు. ఇవాళ మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడి మోస్తారు వర్షాలు పడనున్నట్లు స్ఫష్టం చేశారు.

Alert to the people of AP Thunderstorms today

విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు రోణంకి కూర్మనాథ్.

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని… సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండని సూచనలు చేశారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్‌.

Read more RELATED
Recommended to you

Latest news