ఏపీలో ఘోర ప్రమాదం..లారీని ఢీకొన్న అంబులెన్స్..4 గురు మృతి

-

ఏపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీని ఢీకొంది ఓ అంబులెన్స్. ఈ సంఘటనలో 4 గురు మృతి చెందారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… చిత్తూరు తవంణపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకిట్టింది. ఈ సంఘటనలో నలుగురు మృతి చెందగా…. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

చిత్తూరు- తిరుపతి హైవే పై నిలిచి ఉన్న ట్యాంకర్ ను వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్ ఢీకొట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఏడు మందిలో నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ఒక ఆడవారు, ముగ్గురు మగవారు ఉన్నట్లు గుర్తించారు. ఇక ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ సిబ్బంది…గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక అటు అన్నమయ్య జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కేవీపల్లి మండలం మఠంపల్లి వద్ద తుఫాన్‌ వాహనం-లారీ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో 11 మందికి గాయాలు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news