కృష్ణా జిల్లాలో దారుణం..2 రోజుల పాటు ఇంట్లో నిర్భంధించి మహిళపై లైంగిక దాడి!

-

 

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో దారుణం చోటు చేసుకుంది. రెండు రోజులు పాటు ఇంట్లో నిర్బంధించి మహిళా పై అత్యాచారం ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పెడనలో అద్దె ఇంట్లో నివసిస్తున్న కారే తేజశ్రీ (32 )మచిలీపట్నంలో జీవీకే రోల్డ్ గొల్డు కవరింగ్ పని చేస్తోంది. అయితే… పని నిమిత్తం రోజు మచిలీపట్నం వెళ్లి వచ్చే సందర్బల్లో ఆటో డ్రైవర్ తోకల వినోద్ కుమార్ (25)మరియు అతని స్నేహితుడు దోమపాటి లక్ష్మణరావు వయస్సు (49) పరిచయమయ్యారు.

An atrocity took place in Pedana constituency of Krishna district

ఇక పథకం ప్రకారం ముందుగానే ఆటోలో ఉన్న లక్ష్మణరావు మూడో తారీకు సాయంత్రం 7 గంటల సమయంలో పని ముగించుకుని యధావిధిగా వినోద్ కుమార్ ఆటో ఎక్కింది మహిళ. అనంతరం ఆ ఆటోను శెరువత్తర్లపల్లి తన ఇంటికి తీసుకువెళ్లాడు ఆటో డ్రైవర్ వినోద్ కుమార్. అనంతరం మహిళను ఇంట్లో బంధించి… బీరు తాగించి అతని స్నేహితుడితో పాటు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. రెండు రోజులు పాటు ఇంట్లోనే బంధించి పలుమార్లు అత్యాచారం చేశారని తాజాగా తేలింది. ఈ నెల 5 తారీకు అక్కడ నుంచి తప్పించుకుని పెడన చేరుకుంది మహిళ. అనంతరం తల్లిదండ్రులతో చెప్పడంతో పెడనపోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి… పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news