అనకాపల్లి మైనర్ బాలిక హత్య..నిందితుడి కోసం రూ.50 వేల ప్రకటన!

-

అనకాపల్లి మైనర్ బాలిక హత్య కేసులో కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటి వరకు మైనర్ బాలిక హత్య కేసులో పురోగతి కనిపించలేదు. మూడో రోజు నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. 12 బృందాలు ఏర్పాటు చేసిన దొరకలేదు నిందితుడు ఆచూకీ. ఇక నిందితుడు సురేష్ ఆచూకీ చెప్పిన వారికి 50 వేల రూపాయలు పారితోషికం ప్రకటించింది పోలీస్ శాఖ.

అటు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఎక్కడ కూడా నిందితుడి ఆచూకీ లభించలేదు. సూసైడ్ కి పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ కోణంలో కూడా గాలింపులు చేస్తున్నారు పోలీసులు. వాగులు, గెడ్డల వద్ద పోలీసుల తనిఖీలు కొనసాగుతోంది. కాగా, అనకాపల్లి జిల్లా జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండులో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక హత్య జరిగిని విషయం తెలిసిందే. కేసు దర్యాప్తులో నిందితుడు సురేశ్ రాసిన 13 పేజీల లేఖ లభ్యం అయింది. ఉంటే తామిద్దరం కలిసి ఉండాలని, లేనిపక్షంలో చనిపోవాలని ఆ లేఖలో రాసి ఉంది. అందరూ క్షమించాలని సైతం సురేశ్ కోరారు. దీంతో నిందితుడు సురేశ్ చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news