నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం

-

ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా… ఇవాళ ఉదయం 10 :16 గంటలకు తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు.

andhra-pradesh-formation-day

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు సీఎం జగన్. ఈ సందర్భంగా తెలుగు తల్లికి అలాగే అమరాజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించనున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇక ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు అలాగే ఇతర అధికారులు పాల్గొంటారు. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా ఘనంగా జరుపనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news