BREAKING : అప్పుల్లో కూరుకుపోయిన వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ !

-

 

తెలుగు దేశం పార్టీకి వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరులో పాదయాత్ర నిర్వహిస్తున్న టీడీపీ నేతలు… నా ఆస్తులకు సంబంధించి విడుదల చేసిన పత్రాలపై స్పష్టమైన వివరాలు ఇస్తానని… నేను నెల్లూరు ప్రజలకు..జగన్ కు మాత్రమే సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. నా చిత్తశుద్ధి నిరూపించుకునే అవకాశం కలిగిందని అన్నారు.

గూడూరు ..చెన్నూరుల మధ్య 120 ఎకరాల లేఔట్ ఉందని చెప్పారు… ఉంటే 100 ఎకరాలు మీరే తీసుకోండి… 20 ఎకరాలు నాకు ఇవ్వమని మాజీ ఎమ్మెల్యే సునీల్ ను కోరుతున్నా అని చెప్పారు. దొంతాలిలో 50 ఎకరాలు ఉందన్నారు… అది నా సొంత ఊరు.. అక్కడ 25 ఎకరాలు మాత్రమే కొన్నానని చెప్పారు అనిల్‌ కుమార్‌ యాదవ్‌. ఇనమడుగులో నా బావ మరిది పేరు మీద రెండున్నర ఎకరాలు కొన్నాను… ఐదు ఎకరాలు కాదన్నారు. నాకు రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్నాయని టీడీపీ ఆరోపణలు చేసిందని.. కానీ నాకు మూడు, నాలుగు కోట్ల మేర అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. నేను భూములమ్మిన విషయం వారికి తెలియదా.. ఆ డాక్యుమెంట్లు ఎందుకు విడుదల చేయలేదని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Latest news