అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లె సమీపంలోని చెరువు వద్ద ఆర్టీసీ బస్సు సిమెంట్ లారీ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. కడప వైపు నుంచి తిరుపతి వెళ్తున్న సిమెంట్ లోడు లారీ వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేయబోయిన సిమెంట్ లారీ.. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీ కొట్టింది.

ఈ ప్రమాద తాకిడికి బస్సు ముందు వైపు నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో బస్సులో ఉన్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిలో కడపకు చెందిన శేఖర్, కమాల్ బాషా కాగా.. ఓబులవారిపల్లె మండలం చిన్నఓరంపాడుకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో అంబులెన్స్​లో తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news