ఏపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపి హత్య

-

ఏపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపి హత్య చేశారు. ఈ సంఘటన శుక్ర వారం రాత్రి చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Another person was brutally hacked to death in AP

 

కాగా, వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన.. పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ అరాచక పాలన రాజ్యమేలుతోందని ఆరోపించారు. హత్యలు, అరాచకాలు పెచ్చుమీరాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆటవిక పాలన కొనసాగుతోందని.. మాజీ సీఎం జగన్ ఫైర్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news