పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్‌…హత్యాయత్నం కేసు నమోదు ?

-

Another shock for Pinnelli Ramakrishna Reddy:  పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో షాక్‌…హత్యాయత్నం కేసు నమోదు నమోదు అయింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రెంటచింతల పోలీసులు కేసు నమోదు చేశారు.

Pinnelli Ramakrishna Reddy’s arrest stage ready

ఈ నెల 13న పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేస్తుండగా.. అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై సెక్షన్‌ 307, 147, 148, 120బీ, 324 కింద కేసులు నమోదు అయ్యాయి.

అటు జూన్‌ 6 వరకు పిన్నెల్లి, గోపిరెడ్డి, పెద్దారెడ్డి తదితరులను అరెస్టు చెయ్యొద్దని పోలీసులకు ఆదేశించింది ఏపీ హై కోర్టు. ముఖ్యంగా వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో జూన్ 5వ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అధికారులను హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Latest news