చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మరో షాక్‌..41C నోటీసు జారీ !

-

Chevireddy Mohit Reddy: తిరుపతి లోని చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. ఇక దీనిపై మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ కేసులో సంబంధం లేని నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహించారు,. 41 సి నోటీసు ఇచ్చారు… దీనికి నానా హంగమా చేశారని మండిపడ్డారు.

రాజకీయ కక్షతో పులివర్తి నాని చేస్తున్న పనులకు తగిన బుద్ది చెబుతామని వార్నింగ్‌ ఇచ్చారు మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఒక్క కేసు కాదు వంద కేసులు అయినా పెట్టుకోండి ..చంద్రగిరి ప్రజల తరపున పోరాటం చేస్తునే ఉంటాము.ఈ కేసులో నాకు ఎలాంటి సంబంధం లేదు.. కావాలనే నా పేరు పోలీసులు పెట్టారని ఫైర్‌ అయ్యారు. ఇప్పటి దాక ప్రజలు గెలిపించారు టైం ఇద్దామని అనుకున్నాం…ఇక పోరాటం తప్పదు..మా కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news