ఈఎస్ఐ స్కాం లో ఏపీ ఏసీబీ దూకుడు, హైదరాబాద్ లో ప్రత్యేక బృందం

-

ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐ స్కాం లో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్ళింది ఏసీబీ ప్రత్యేక బృందం. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు పితాని సురేష్ కోసం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పితాని సురేస్ హైదరాబాద్ లో ఉన్నాడు అని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ స్కాం లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్న సమయంలో మందులు కొనుగోలు చేయడానికి సిఫారసు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా మరి కొందరిని అరెస్ట్ చేసారు. ఇక పితాని దగ్గర పీఎస్ గా చేసిన మురళీ మోహన్ ని అరెస్ట్ చేసారు. తనను అరెస్ట్ చేయవద్దు అని పితాని సురేష్ హైకోర్ట్ కి వెళ్ళారు.

Read more RELATED
Recommended to you

Latest news