BREAKING : బాలయ్యకు ఏపీ అసెంబ్లీ మొదటి హెచ్చరిక

-

BREAKING : టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. టీడీపీ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలయ్యకు ఏపీ అసెంబ్లీ మొదటి హెచ్చరిక జారీ చేసింది. వాయిదా పడిన అసెంబ్లీ కాసేపటి క్రితమే ప్రారంభం అయింది. సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ ఛెయిర్ ను చుట్టుముట్టకుండా మార్షల్స్ ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్ళటానికి మార్షల్స్ ను నెడుతున్నారు టీడీపీ సభ్యులు. ఈ తరుణంలోనే… మీసాలు మెలేసిన బాలకృష్ణ ను హెచ్చరించారు స్పీకర్ తమ్మినేని. మొదటి తప్పు గా పరిగణిస్తున్నాం… పునరావృతం చేయవద్దు అంటూ ప్రకటన చేశారు స్పీకర్ తమ్మినేని. కాగా, ఏపీ అసెంబ్లీ ఇవాళ మీసాలు తిప్పడం, తొడగొట్టడానికి వేదికైంది. సమావేశాలు ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసన చేపట్టగా… అంబటి వారిని వారించారు. దీంతో ఆయనను చూస్తూ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ మీసం తిప్పారు. అది చూసి అంబటితో పాటు ఇతర వైసిపి సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news