ఏపీ దివ్యాంగులకు కేంద్రం శుభవార్త…ప్రత్యేక స్కిల్ ట్రైనింగ్‌ !

-

ఏపీ దివ్యాంగులకు కేంద్రం శుభవార్త… శ్రీకాకుళంలో జరిగిన దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు….గత వైసీపీ ప్రభుత్వం విశాఖ రైల్వే జోన్ కు కావాల్సిన భూమి చూపించలేకపోయిందన్నారు.ఈ కారణంగానే రైల్వే జోన్ ప్రక్రియ ఆలస్యం అయ్యిందని.. రైల్వే జోన్ కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించిందని పేర్కొన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు.

కూటమి ప్రభుత్వం రైల్వే జోన్ ను టాప్ ప్రియారిటీ గా తీసుకుందని…రైల్వే జోన్ కు కావాల్సిన భూ సేకరణ ప్రక్రియ ప్రారంభించామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్కిల్ ట్రెయినింగ్ అంశాన్ని పరిశీలిస్తున్నామని ప్రకటన చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది…శ్రీకాకుళం లో దివ్యాoగుల కోసం రెండు కోట్ల 98 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేసామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒక పూట కలెక్టరేట్ లో దివ్యాంగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ పెట్టాలన్నారు కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి రామ్మోహన్ నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news