నేడు గుజరాత్ కు ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ

-

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గుజరాత్‌ పర్యటన ఖరారు అయింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో పర్యటించబోతున్నారు. ‘రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్-2024’ లో పాల్గొని ప్రసంగించనున్నారు.

AP CM Nara Chandrababu Naidu’s visit to Gujarat has been finalized

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, మానవ వనరుల గురించి జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేయనున్నారు. ఈ సదస్సును పీఎం మోడీ ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా పీఎంతో సీబీఎన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని వరద నష్టాన్ని ఆయనకు వివరిస్తారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news