ఏపీ కీలక నిర్ణయం..ఏం చదివారో తెలుసుకోడానికి ఇంటింటి సర్వే

-

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఏపీలో అసలు ఉన్నత విద్య పరిస్థితి ఎలా ఉండనే అంశం తెలుసుకోవడానికి ఉన్నత విద్యామండలి ఇంటింటి సర్వే చేపట్టడానికి సిద్దం అయిందని అంటున్నారు. ఈ సర్వే కోసం పాఠశాల విద్యా శాఖలో క్లస్టర్‌ రిసోర్సు పర్సన్లు(సీఆర్పీ), గ్రామ, వార్డు విద్య, సంక్షేమ సహాయకుల సేవలను వినియోగించుకోనుందని సమాచారం.

అసలు ఈ సర్వే ద్వారా ప్రతి ఇంట్లో ఎంత మంది ఉన్నారు ? ఆ ఉన్న వారు ఏం చదువుకున్నారు ? చదువు ఎందుకు ఆపేస్తున్నారు ? లాంటి అనేక వివరాలు సేకరిస్తారు. సర్వేపై మొదట సీఆర్పీలకు శిక్షణ ఇస్తారు. వీరు విద్య, సంక్షేమ సహాయకులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం 19 ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి కూడా సిద్దం అయినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news