దిశ నిందితుల ఎన్కౌంటర్ కి ఏడాది..

-

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్కౌంటర్ నేటికి ఏడాది పూర్తయింది. తొండుపల్లి గేట్ వద్ద దిశ(పోలీసులు పెట్టిన పేరు) అనే వెటర్నరీ డాక్టర్ ను అత్యాచారం చేసిన నలుగురు నిందితులు దారుణంగా హత్య చేశారు. షాద్ నగర్ చటన్ పల్లి అండర్ బ్రిడ్జ్ కింద దిశ ను పెట్రోల్ పోసి నిందితులు తగలబెట్టారు.

మహమ్మద్ ఆరిఫ్ , చెన్నకేశవులు, జోల్లు శివ, జోల్లు నవీన్ లను టెక్నీకల్ ఎవిడెన్స్ ఆధారంగా అరెస్ట్ చేశారు పోలీసులు. గత ఏడాది డిసెంబర్ 6 న ఉదయం 5 గంటలకు సీన్ రీ కన్స్ట్రాక్షన్ కు వారిని తీసుకు వచ్చారు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా పోలీసులు పై దాడి చేసి నిందితులు పరారవడానికి యత్నించారు. ఈ క్రమంలో చటాన్ పల్లి వ్యవసాయ పొలాల్లో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపారు సైబరాబాద్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news