ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆస్తి పన్ను చట్టానికి సవరణ

-

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్ను చట్టానికి సవరణ చేస్తూ పురపాలక శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి ఆస్థి పన్ను రిజిస్ట్రేషన్ విలువ ఆధారంగా నిర్ధారించానున్నారు. ప్రస్తుతం ఏడాది అద్దె విలువ ప్రాతిపదికన ఆస్థిపన్నును ప్రభుత్వం లెక్కిస్తోంది. రిజిస్ట్రేషన్ విలువలను సవరించిన ప్రతీసారీ ఆ మేరకు ఆస్తి పన్ను పెరగనునుంది. ప్రస్తుత విధానం కంటే కొత్త విధానంలో ఆస్థి పన్ను కనీసం పది శాతం కంటే ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.

ధార్మిక, విద్య, వైద్యం, స్మారక, సాంస్కృతిక కట్టడాలకు ఆస్తిపన్ను మినహాయింపును ఇస్తూ నోటిఫికేషన్ లో ప్రభుత్వం పేర్కొంది. సైనికులు, మాజీ సైనికుల గృహాలకు కూడా ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చారు. 375 చదరపు అడుగులకు లోపున్న భవనాలకు వార్షిక ఆస్తి పన్నుగా రూ. 50 నిర్ధారించారు. ఆస్తి విలువ ఖరారు చేసేందుకు భవనాలను నిర్మాణ శైలి ఆధారంగా వర్గీకరణ చేయనున్నారు. ఆర్ సీసీ, పెంకులు, రేకులు, నాపరాళ్లు, పూరిళ్ల వంటి ఆధారంగా ఆస్తిపన్ను విధించనున్నారు. ఆస్తి పన్ను నిర్ధారణలో అక్రమ కట్టడాలకు 25 నుంచి 100 శాతం వరకూ జరిమానా కూడా విధించనున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news