BREAKING : ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల..ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి

-

ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. కాసేపటి క్రితమే ఏపీ విద్యాశాఖ మంత్రి బోత్స సత్యనారాయణ ఆంధ్ర ప్రదేశ్‌ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి, రెండు సంవత్సరాలు, ఒకేషనల్ కోర్సు ఫలితాలను విడుదల చేశారు.

ఈ ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 4, 45, 604 మంది విద్యార్థులు హాజరు కాగా.. ఇంటర్ రెండో సంవత్సరం 4 లక్షల 23 వేల 455 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఒకేషనల్ పరీక్షలు 72వేల 299 మంది విద్యార్థులు రాశారు. మొత్తంగా ఇంటర్‌ పరీక్షలకు 9,41,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిసారిగా సిసి కెమారాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించిన ఇంటర్ బోర్డు… ఇవాళ ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది.

ఇక ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ లో 54 శాతం ఉత్తీర్ణత కాగా.. సెకండీయర్‌ లో 61 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యారులు. మొదటి సంవత్సరం 4,45,604 మంది పరీక్షలు రాయగా 2,41,591 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం 4,23, 458 మంది రాయ గా ఉత్తీర్ణులైన వారు 2,58,449. ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా.

NOTE : ఫలితాలు అందుబాటులో ఉండే వెబ్ సైట్లు

Https:// examresults.ap.nic.in

www.bie.ap.gov.in

Read more RELATED
Recommended to you

Latest news