సీఎం జగన్‌, వైసీపీకి సర్పంచ్ ల సత్తా ఏంటో రుచి చూపిస్తాం !

-

సీఎం జగన్‌, వైసీపీకి సర్పంచ్ ల సత్తా ఏంటో రుచి చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్. అనకాపల్లిలో పంచాయతీరాజ్ ఛాంబర్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… మా డిమాండ్లు పరిష్కరించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి, అధికార పార్టీకి సర్పంచ్ ల సత్తా ఏమిటో రుచి చూపిస్తామని హెచ్చరించారు.

గ్రామ సచివాలయాలను, వాలంటీర్లను పంచాయతీలలో విలీనం చేసి, గృహ సారధులను సచివాలయ కన్వీనర్లను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సర్పంచులకు పంచాయతీలకు సమాంతరంగా సచివాలయాలు, వాలంటీర్లను ఏర్పాటు చేసి సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారు.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు.పంచాయతీ వేల కోట్ల నిధులను, ఆదాయ వనరులను రాష్ట్ర ప్రభుత్వం దొంగలించి సొంత అవసరాలకు వాడుకుంటుంది…పంచాయతీల నుండి దొంగలించిన వేలకోట్ల రూపాయల నిధులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి పంచాయతీలకు జమ చేయాలని కోరారు పంచాయతీరాజ్ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్.

Read more RELATED
Recommended to you

Latest news