4 జిల్లాలకు కొత్త డీసీసీబీ చైర్మన్ల నియామకం

-

ఏపీలోని జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపిలో 4 జిల్లాలకు కొత్త డీసీసీబీ చైర్మన్, పాలకవర్గం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. మిగిలిన 9 జిల్లాల డిసిసిబి పాలకవర్గాలు యథాతథంగా కొనసాగించింది.

ప్రకాశం, కర్నూల్, కృష్ణా, విశాఖపట్నం డీసీసీబీలకు నూతన చైర్మన్లు నియామకం చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం… కృష్ణా డిసిసిబి చైర్మన్ గా తాతినేని పద్మావతి, ప్రకాశం డిసిసిబి చైర్మన్ గా వై.ప్రసాద్ రెడ్డి, కర్నూల్ డిసిసిబి చైర్మన్ గా ఎస్వీ విజయ మనోహరి, విశాఖపట్నం డిసిసిబి చైర్మన్ గా కోలా గురువులు నియామకం అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news