వైసీపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఆ పార్టీ ఎంపికి కీలక పదవి

-

వైసీపీకి కేంద్రం బంపర్ ఆఫర్.. ఇచ్చింది. వైసీపీ మహిళ ఎంపీకి కీలక పదవి దక్కింది. కాఫీ బోర్డు సభ్యురాలుగా అరకు వైయస్సార్సీపీ ఎంపీ గోడేటి మాధవి నియమితులు అయ్యారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

కాఫీ బోర్డును పునర్ నియమిస్తూ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ లో సభ్యులుగా ఎంపీ ప్రతాప్ సిన్హా, రాజ్యసభ సభ్యుడు ఎన్. చంద్రశేఖరన్ కూడా ఉన్నారు. తనకు ఈ పదవి రావడం పై ఎంపీ మాధవ్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ బోర్డులో కాఫీ సాగు చేసే రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధుల విభాగంలో ఏపీ గిరిజన సంక్షేమ విభాగం కార్యదర్శి కాంతిలాల్ దండేకు అవకాశం దక్కింది.

అలాగే కాఫీ పండించే వారి విభాగంలో విశాఖ జిల్లా దోమంగికి చెందిన విశ్వనాథం, కొత్త పాడేరుకు చెందిన కురుస ఉమామహేశ్వర రావు, వాణిజ్య విభాగంలో విశాఖ జిల్లా కిన్నెర్లకు చెందిన జయతు ప్రభాకర్ రావు, ఇన్ స్టంట్ కాఫీ ఉత్పత్తిదారుల విభాగంలో హైదరాబాదుకు చెందిన చల్ల శ్రీశాంత్ లను వాణిజ్య శాఖ సభ్యులుగా నియమించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version