ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనిపించడం లేదా..? – అయ్యన్నపాత్రుడు

-

తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుపై కేంద్ర పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఢిల్లీ పెద్దలకు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ లో ఢిల్లీ పెద్దల పాత్ర ఉన్నందుకే మాట్లాడడం లేదా..? ఈ మౌనం దేనికి సంకేతం అని నిలదీశారు అయ్యన్నపాత్రుడు. అంతేకాదు కేంద్రం ఇచ్చే నిధులను జగన్ పక్కదోవ పట్టిస్తున్నా మీకు కనిపించడం లేదా..? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి దారుణమైన పరిస్థితిని తాను ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, నారా లోకేష్. టిడిపి సీనియర్ నేతలు అయ్యన్నపాత్రుడు , కనకమెడల, చినరాజప్ప, సోమిరెడ్డి తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. అలాగే పార్టీ సీనియర్ నేతలు కాసేపట్లో చంద్రబాబుతో మూలాఖత్ కానున్నారు. ఆయనని కలిసేందుకు ఇప్పటికే జైలు అధికారుల అనుమతి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news