ఏపీపై ‘అసని’ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. ఈ జిల్లాలో భారీ వర్షాలు..!

-

ఏపీకి భారీ వర్షాలు ఉండనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయా బంగాళఖాతంలో ప్రస్తుతం ఆసని తుఫాను కొనసాగుతుందని చెప్పారు. ఇది రానున్న ఆరుగంటల్లో తీవ్ర తుఫాన్‌ గా మారే అవకాశం ఉందని.. ఈ తుఫాను ఈ నెల 10 నాటికి ఉత్తర కోస్తాంధ్ర – ఒడిశా తీరానికి దగ్గర వస్తుందని వెల్లడించారు.

అసని తుఫాను ఎఫెక్ట్‌ తో ఏపీ, ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో కురిసే అవకాశం ఉందన్నారు. ఏపీలో విశాఖ పట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. తీవ్ర తుఫాను నేపథ్యంలో మత్స్యకారులు గురువారం వరకు చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గంటలకు 40 కిమీ నుంచి 50 కిమీ వేగంతో.. అప్పుడప్పుడు 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news