జగన్ అండతో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయి – అచ్చెన్నాయుడు

-

సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి సవాల్ విసిరారు. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలు ఉదయం సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపి, టిడిపి వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. ఈ ఘటనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.

సీఎం జగన్ అండతో వైసీపీ రౌడీ మూకలు రెచ్చిపోతున్నాయని విమర్శించారు. పల్లె రఘునాథ్ రెడ్డి కారు ధ్వంసం చేయడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే అరాచకాలకు నిలయంగా మార్చారని.. వైసీపీ రౌడీ మూకలు దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దాడి చేసిన వారిని వదిలేసి టిడిపి కార్యకర్తలపై లాఠీచార్జి చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news