ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో 28 మంది

-

గుండెపోటుతో మృతి చెందిన దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అసెంబ్లీ స్థానం కైవసం చేసుకునేందుకు ఏకంగా 28 మంది అభ్యర్థులు బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో చనిపోయిన నేతల కుటుంబాల సభ్యులకే టికెట్ ఇస్తే పోటీ చేయరాదన్న సాంప్రదాయాన్ని గౌరవించిన టిడిపి పోటీకి దూరంగా ఉండిపోయింది.

ఇక విక్రమ్ రెడ్డి తో పాటు ఇప్పటికే చాలా మంది ఈ ఉపఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం నామినేషన్ల గడువు కు చివరి రోజు కావడంతో ఈ ఒక్క రోజే ఏకంగా 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వెరసి ఈ ఉప ఎన్నికకు ఇప్పటిదాకా 28 నామినేషన్లు దాఖలైనట్లైంది. అయితే నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసేలోగా వీరంతా బరిలోనే నిలుస్తారా? లేదా తప్పుకుంటారా? అన్నది వేచి చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news