ఏపీలో దారుణం.. నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం

-

ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం చేశారు దుండగుడు.  ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఈ ఘటనలు చూస్తుంటే అది ఎవ్వరి నిర్లక్ష్యమో అర్థం కావడం లేదు. ముక్కు పచ్చలారని చిన్నారులపై ఈ దుర్మార్గులు దుర్బుద్దితో వ్యవహరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇలాంటి అవమానీయ ఘటనలు చోటు చేసుకోవడం శోచనీయం. తాజాగా ఏలూరు జిల్లాలోని నూజీవీడు మండల కేంద్రంలో నాలుగేళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి పామాయిల్ తోటలో అత్యాచారం చేశాడు. ఈ ఘటన పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఆ నిందితుడికి కఠిన శిక్ష పడాలని ఎస్పీ ని కోరారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడి కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. 

 

Read more RELATED
Recommended to you

Latest news