వివేకాను చంపినట్లే..నీ భర్తను చంపేస్తామని బెదిరించారు – ఉమాశంకర్ రెడ్డి భార్య

-

వివేకాను చంపినట్లే..నీ భర్తను చంపేస్తామని బెదిరించారని ఉమాశంకర్ రెడ్డి భార్య స్వాతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో అరెస్టయి చంచల గూడ జైల్లో ఉన్న ఉమాశంకర్ రెడ్డి ఇంటిపై కొందరు వ్యక్తులు దాడి చేసి, భయ బ్రాంతులకు గురిచేశారని ఉమా శంకర్ రెడ్డి సతీమణి స్వాతి ఆరోపించారు.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో కొమ్మా పరమేశ్వర రెడ్డి ఇంట్లోకి చొరబడి, తనపై చెప్పుతో దాడి చేసి, చెప్పలేని విధంగా బూతులు తిడుతూ, వివేకా ను ఎలాగైతే చంపారో అలాగే తన భర్త బయటకు రాగానే చంపుతామని బెదిరించారని స్వాతి ఆరోపిస్తోంది. పరమేశ్వర రెడ్డి దాడిలో గాయపడిన స్వాతి స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేరారు. దాడి ఘటనపై పులివెందుల పోలీసులకు స్వాతి పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్వాతి స్టేట్ మెంట్ ను రికార్డ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news